విశాఖ ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా.... - ఐదుగురు మృతి

విశాఖ ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా.... - ఐదుగురు మృతి

విశాఖ ఏవోబిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  హంతల్​గుడ ఘాట్​ రోడ్డులో టిప్పర్​ బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు. చిత్రకొండ నుంచి సిమెంట్​ లోడ్​ తో వస్తున్న లారీ ఘాట్​ రోడ్డు వద్ద అదుపుతప్పి సిమెంట్​ లోడ్​ టిప్పర్​ బోల్తాపడింది.  

చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.