విశాఖ ఏవోబిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్గుడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు. చిత్రకొండ నుంచి సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ ఘాట్ రోడ్డు వద్ద అదుపుతప్పి సిమెంట్ లోడ్ టిప్పర్ బోల్తాపడింది.
చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.